నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 01 : తంబళ్లపల్లె మండలం గోపి దీన్నే సెక్టార్ గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ రమణమ్మ అంగనవాడి కార్యకర్తలు గర్భవతులు, తల్లులు కు తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత వివరించారు. బిడ్డ పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు రాత్రి, పగలు పట్టించాలన్నారు. ఆరు మాసాల అనంతరం గంజి ఉడికించిన పప్పు, భోజనం పెట్టవచ్చని ఈ పాలు త్రాగడం వల్ల వ్యాధినిరోధక శక్తి పిల్లలకు పెరుగుతుందన్నారు. తల్లిపాల వారోత్సవం పై పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు
Reporter
Namitha News