నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 17 : గుర్రంకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ లోకేశ్వర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి శ్రీ సురేంద్రబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తఖివుల్లా ఖాన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు మరియు విద్యా వసతులు గురించి తల్లిదండ్రులకు వివరిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సైన్స్ ల్యాబ్స్,ఒకేషనల్ కోర్సులు మరియు ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయుల సేవలు,ఆటపాటలతో విద్యాభ్యాసం అభ్యసించడం ఇటువంటి కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా ప్రోత్సహించడం జరిగింది
Reporter
Namitha News