నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రతి కార్యకర్త అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలి కార్యక్రమం లో బిజెపి నాయకులు.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని అందులో భాగంగా పుంగనూరు మండల సమావేశం నిర్వహించి అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలతో కలసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు యం.జగదీష్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తద్వారా కాలుష్యం తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికా రాణి,అరవ పల్లి వెంకటరెడ్డి, చంద్ర శేఖర్ రాజు,TVS ప్రసాద్,రమేశ్, డాక్టర్ జగన్నాథం,వెంకటేష్,నాగరాజ, రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News