Friday, 31 July 2026 01:51:09 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి

గ్రంధాలయ అధికారిణి ఆధ్వర్యంలో అతిథులకు ఘనసన్మానం

Date : 06 June 2026 06:22 PM Views : 96

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి - గ్రంధాలయ అధికారిణి ఆధ్వర్యంలో అతిథులకు ఘనసన్మానం మదనపల్లె : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు.శనివారం గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం అట్టహాసంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక,టీఎస్ఏ కృష్ణమూర్తి,జనార్ధన్ రెడ్డి,వై.ఎస్.మునిరత్నమయ్య,కామకోటి ప్రసాద్ రావు,గొల్లపూడి తిరుపతి రావు,విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డెప్ప,హేమలత,డాక్టర్,భవాని దేవి,లింగాల యుగంధరాచారి,పి.ఎం.నాగరాజు,నంద కిశోర్,జగన్మోహన్,చక్రవర్తి,విద్యాసాగర్ సిబ్బంది జయమ్మ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ప్రస్తుతం సెల్ ఫోన్,టివి,సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి విద్యార్థులు పుస్తక పఠనాన్ని వదిలేస్తున్నారన్నారు.గ్రంధాల యాలలో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని,గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే మేథోసంపత్తిని పెంపొందించుకోవడంతోపాటు ఉద్యోగ సాధన సులభతరమవుతుందన్నారు.అనంతరం వై.ఎస్ మునిరత్నం,జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుండి జూన్ 6వరకు గ్రంథాలయ వేసవిజ్ఞాన శిబిరం అద్భుతంగా సాగిందన్నారు.స్పోకెన్ ఇంగ్లీష్,వ్యాసరచన,డ్రాయింగ్,యోగా,చిత్రలేఖనం,మానవతా విలువలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.నాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని,నేడు గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.వేసవిజ్ఞాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన గ్రంథాలయ అధికారిణి వసంత కుమారిని అభినందిస్తూ,సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు,అతిథులను గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :