నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి - గ్రంధాలయ అధికారిణి ఆధ్వర్యంలో అతిథులకు ఘనసన్మానం మదనపల్లె : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు.శనివారం గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం అట్టహాసంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక,టీఎస్ఏ కృష్ణమూర్తి,జనార్ధన్ రెడ్డి,వై.ఎస్.మునిరత్నమయ్య,కామకోటి ప్రసాద్ రావు,గొల్లపూడి తిరుపతి రావు,విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డెప్ప,హేమలత,డాక్టర్,భవాని దేవి,లింగాల యుగంధరాచారి,పి.ఎం.నాగరాజు,నంద కిశోర్,జగన్మోహన్,చక్రవర్తి,విద్యాసాగర్ సిబ్బంది జయమ్మ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ప్రస్తుతం సెల్ ఫోన్,టివి,సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి విద్యార్థులు పుస్తక పఠనాన్ని వదిలేస్తున్నారన్నారు.గ్రంధాల యాలలో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని,గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే మేథోసంపత్తిని పెంపొందించుకోవడంతోపాటు ఉద్యోగ సాధన సులభతరమవుతుందన్నారు.అనంతరం వై.ఎస్ మునిరత్నం,జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుండి జూన్ 6వరకు గ్రంథాలయ వేసవిజ్ఞాన శిబిరం అద్భుతంగా సాగిందన్నారు.స్పోకెన్ ఇంగ్లీష్,వ్యాసరచన,డ్రాయింగ్,యోగా,చిత్రలేఖనం,మానవతా విలువలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.నాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని,నేడు గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.వేసవిజ్ఞాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన గ్రంథాలయ అధికారిణి వసంత కుమారిని అభినందిస్తూ,సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు,అతిథులను గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
Reporter
Namitha News