Tuesday, 09 June 2026 08:17:17 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి

గ్రంధాలయ అధికారిణి ఆధ్వర్యంలో అతిథులకు ఘనసన్మానం

Date : 06 June 2026 06:22 PM Views : 21

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి - గ్రంధాలయ అధికారిణి ఆధ్వర్యంలో అతిథులకు ఘనసన్మానం మదనపల్లె : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు.శనివారం గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం అట్టహాసంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక,టీఎస్ఏ కృష్ణమూర్తి,జనార్ధన్ రెడ్డి,వై.ఎస్.మునిరత్నమయ్య,కామకోటి ప్రసాద్ రావు,గొల్లపూడి తిరుపతి రావు,విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డెప్ప,హేమలత,డాక్టర్,భవాని దేవి,లింగాల యుగంధరాచారి,పి.ఎం.నాగరాజు,నంద కిశోర్,జగన్మోహన్,చక్రవర్తి,విద్యాసాగర్ సిబ్బంది జయమ్మ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ప్రస్తుతం సెల్ ఫోన్,టివి,సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి విద్యార్థులు పుస్తక పఠనాన్ని వదిలేస్తున్నారన్నారు.గ్రంధాల యాలలో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని,గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే మేథోసంపత్తిని పెంపొందించుకోవడంతోపాటు ఉద్యోగ సాధన సులభతరమవుతుందన్నారు.అనంతరం వై.ఎస్ మునిరత్నం,జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుండి జూన్ 6వరకు గ్రంథాలయ వేసవిజ్ఞాన శిబిరం అద్భుతంగా సాగిందన్నారు.స్పోకెన్ ఇంగ్లీష్,వ్యాసరచన,డ్రాయింగ్,యోగా,చిత్రలేఖనం,మానవతా విలువలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.నాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని,నేడు గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.వేసవిజ్ఞాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన గ్రంథాలయ అధికారిణి వసంత కుమారిని అభినందిస్తూ,సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు,అతిథులను గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :