నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 : మల్లయ్య కొండ మహాశివుని సన్నిధిలో సోమవారం మహిళా కళాకారులు మల్లయ్య కొండల మైనింగ్ పై వ్యతిరేకిస్తూ కొండల సంరక్షణకు సహకరించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ప్రతిరోజు మల్లయ్య కొండ శివాలయంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాటు ఇతర జిల్లాల నుండి వందలాదిగా చెక్కభజన, కోలాటాలు, సంకీర్తనలు చేసే బృందాలు తమ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం మహిళా కళాకారులు ఎమ్మెల్యే తో మహాశివుడు మన అందరికీ ఆరాధ్య దైవమని నాటికి నేటికీ ఆయన శివనామ స్మరణే మాకు శరణ్యమని అలాంటి దేవదేవుని కొండలను కూలుస్తామంటే సహించమన్నారు. కొండలను కాపాడడానికి మా వంతు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యేగా మీరు అండగా నిలబడి రాగద్వేషాలకతీతంగా సమిష్టిగా ఆ ముక్కంటి మహా శివుని కోసం పోరాడితే పోయేదేంలేదని ఎంతటి త్యాగానికైనా సిద్ధమని హర్షద్వానాల మధ్య శపథం చేశారు. మైనింగ్ చర్యలపై మహిళా కళాకారుల చెప్పిన మాటలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ముగ్ధుడై కొండల సంరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నీ ప్రోత్సాహంతో మైనింగ్ చర్యలు ఆపడానికి ముందుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మహిళా కళాకారులు, శివ భక్తులు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News