నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దౌర్జన్యంగా మా విలువైన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బాధితురాలు అమరావతి ఫిర్యాదు మదనపల్లె : దౌర్జన్యంగా తమ విలువైన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని మదనపల్లె మండలం,వేంపల్లె పంచాయతీ,బండకాడపల్లెకి చెందిన పొన్న సహదేవ భార్య పొన్న అమరావతి పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నందు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అమరావతి మాట్లాడుతూ ఏప్రిల్ 25,2011వ తేదీన పొన్నిటీపాళ్యం పంచాయతీ సర్వే నెంబర్ 10-1,11-1లో ప్లాట్ నెంబర్ (4) 229.77 చదరపు గజాల స్థలాన్ని మంత్రి ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశామన్నారు.అయితే ఇటీవల కాలంలో మా పక్క స్థలం యజమానులు బుక్యా శ్రీనివాసులు నాయక్ ఆయన కుమారులు బి.ఉమామహేశ్వర నాయక్ (సర్వేయర్),బాలు నాయక్ అనువారు తాము ఇంటి నిర్మాణం చేసుకోవాలని,మీ స్థలంలో ఇంటి నిర్మాణ సామాగ్రిని నిలువ చేసుకుంటామని కోరగా తాము అంగీకరించామన్నారు.వారు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారని,ఇదే అదునుగా భావించి మా స్థలాన్ని ఖాళీ చేయకుండా ఇసుకను నిలువ ఉంచుకుంటున్నారన్నారు.మా స్థలంలో ఇసుకను ఖాళీ చేసి శుభ్రం చేయాలని వారిని కోరగా దుర్భాషలాడుతూ దాడులకు ప్రయత్నించారన్నారు.అంతేకాకుండా మా స్థలంలోకి వారి అనుచరులను తీసుకువచ్చి మమ్మల్ని ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారన్నారు.ఆ స్థలం తాము నిర్ణయించిన ధరకు విక్రయించి వెళ్లిపోవాలని లేనియెడల మీపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉమామహేశ్వర నాయక్ (సర్వేయర్) రెవెన్యూ రికార్డులు ఎలా తారుమారు చేయాలో తనకు తెలుసునని,నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకోండని,మాకు రాజకీయ నాయకుల అండ ఉందని హెచ్చరిస్తున్నారని వాపోయారు.మా స్థలంలో తరచూ మద్యం సేవిస్తూ టెంట్లు వేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.శ్రీనివాసులు నాయక్ వారి అనుచరుల నుండి మాకు ప్రాణహాని ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకుని,మా స్థలాన్ని వారి ఆశ్రమం నుండి కాపాడి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
Namitha News