Thursday, 30 July 2026 07:57:57 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లె సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ సీఎం కి శ్రీరామ్ చినబాబు వినతి

Date : 07 July 2026 04:50 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని సీఎం కి వినతి .....తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు విశాలాంధ్ర, మదనపల్లి: జిల్లా కేంద్రంగా ఏర్పడిన మదనపల్లె పట్టణాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. విజయవాడలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి మదనపల్లె అభివృద్ధికి అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ముఖ్యంగా పట్టణంలో రోడ్ల అనుసంధానం మెరుగుపరచడం, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, విద్య, వైద్య రంగాలను మరింత అభివృద్ధి చేయడం, ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లె టమోటా మార్కెట్‌ను ఆధునికీకరించడం, రోడ్లు–భవనాల శాఖ పరిధిలో మౌలిక సదుపాయాలను విస్తరించడం, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీరామ్ చినబాబు విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :