నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 20 : అమరావతి సృష్టికర్త, 2047 విజన్ ఆధ్యుడు సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణి చేశారు. ఆస్పత్రి ఎదుట చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించి పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, మదన్ మోహన్ రెడ్డి,సోమశేఖర్,ఆదిరెడ్డి, శివరాం, తంబళ్లపల్లె అధ్యక్షుడు మహేష్,లోకేశ్వర్ రెడ్డి, కుక్కరాజు పల్లి బాబ్ జాన్, శేఖర్ రెడ్డి, జగదీష్, జయరాంరెడ్డి, బిజెపి మండల మాజీ అధ్యక్షుడు రామస్వామి రెడ్డి,భాస్కర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News