Friday, 31 July 2026 04:54:03 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

గ్రామ సచివాలయాలు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 17 January 2026 10:05 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 17: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. పి.టి.యం మండలం కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిత తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా సచివాలయం లోని హాజరు పట్టిక, వి.ఆర్.ఓ కి సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. సచివాలయంలోని విఆర్ఓ, సర్వేయర్ లతో జిల్లా కలెక్టర్... గ్రామంలో రెవెన్యూ శాఖ కు సంబంధించిన సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. దారి సమస్యలు, రీ సర్వే, మ్యుటేషన్ లు, తదితర రెవెన్యూ శాఖ కు సంబంధించిన సమస్యలు అన్ని గ్రామ సచివాలయం లోనే పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలని, ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం మరియు జిల్లా అధికారుల చుట్టూ తిరగకుండా వారి సమస్యలు గ్రామ స్థాయి లోనే ప్రజా పరిష్కారాల వేదిక నందు వారి సమస్యలను పరిష్కరించాలని, జిల్లా సచివాలయం నుండి అందుతున్న అర్జీల పై వెంటనే స్పందించి బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించే దిశగా పని చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీ తో మాట్లాడుతూ.... గ్రామంలో ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందా లేదా, మూడు నెలలకు ఒకసారి పంచాయతీ వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరించే సమయంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించి చెత్తను ప్రతి రోజు సేకరించాలని తద్వారా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటించాలని గ్రామానికి సరఫరా చేస్తున్న నీళ్ల ట్యాంకు ప్రతి మూడు నెలలకి ఒక సారి శుభ్రపరచి ప్రజలకు మంచి నీరు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా ఏర్పాటుచేసిన ప్రభుత్వ సేవలు అన్నిటిని ప్రజలకు సులభతరంగా అందజేయాలన్నారు. దీనితోపాటు రైతులకు తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యవసాయంనకు అవసరమైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించే విషయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ పాత్ర కీలకమన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ ఉదయం మరియు సాయంత్రం ఫేస్ అటెండెన్స్ కచ్చితంగా వేయాలని ఆదేశించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :