నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వీరబల్లి - నవంబర్ 30 : అన్నమయ్య జిల్లా ఆదివారం వీరబల్లి మండలం తాటిగుంటపల్లి గ్రామపంచాయతీ రాయచోటి మరియు రాజంపేట రహదారి నందు సీతంపేట దగ్గర హెచ్.పి పెట్రోల్ బంక్ యజమాని కొండూరు నాగరాజు కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు అక్కడకు విచ్చేసిన చమర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హెచ్.పి నూతన పెట్రోల్ బంకు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాయచోటి రాజంపేట సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు వాహనదారులకు అందుబాటులో ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామమని అలాగే రాయచోటి రాజంపేట మార్గమధ్యంలో పెట్రోల్ డీజిల్ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వాహనదారులకు ఈ పెట్రోల్ బంక్ చాలా ఉపయోగపడుతుందని, వాహనదారుల విషయంలో మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల టిడిపి అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, వీరబల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ అమరేశ్వర రాజు, బిజెపి నాయకులు మహేష్,, కొండూరు మహేష్, తాటిగుంటపల్లి గ్రామ టిడిపి అధ్యక్షుడు భాస్కరరాజు, మైనార్టీ నాయకులు దస్తగిరి, ఇబ్రహీం, ఖాదర్ బాషా, రెడ్డి భాష, మోదిన్, కొత్తపల్లి మహేష్, పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News