నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం క్రాస్ రోడ్ లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య కారణంగా విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర తెలిపారు. క్రాస్ రోడ్ లో చేనేత కార్మికులు అధికంగా విద్యుత్ అవసరాలు పెరగడంతో ఆదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు క్రాస్ రోడ్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె నిర్మాణం, పలుచోట్ల విద్యుత్తు లైన్ల మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం తంబళ్లపల్లె, కోసువారిపల్లె విద్యుత్ సబ్స్టేషన్ లను తనిఖీ చేసి అక్కడ విద్యుత్ సరఫరా, సమస్యలపై ఆరా తీసి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News