నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 24 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం రాయచోటి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, నీటిపారుదల, జాతీయ రహదారులు, డ్వామా తదితర ఇంజనీరింగ్ శాఖల పనుల పురోగతిని సమీక్షించారు. రహదారుల పనులను వేగవంతం చేసి, ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గేలా పూర్తి చేయాలని, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, నాబార్డ్ నిధులతో చేపడుతున్న పనులను మండల, డివిజన్, జిల్లా స్థాయిలతో సమన్వయపరచి చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్, వాటర్ గ్రిడ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖల మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని, ఎన్ హెచ్ 40, 440 రహదారులు, రాయచోటి బైపాస్ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Admin
Namitha News