Wednesday, 17 June 2026 02:56:42 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మల్లయ్య కొండ లో భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

Date : 22 April 2026 08:56 PM Views : 294

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వెలసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రాధాన్యత నివ్వాలని మల్లయ్య కొండ ఆలయ పునర్నిర్మాణ కర్త ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన తొలుత మార్గమధ్యంలోని వెలుగు మల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ఆమెకు తొలి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లయ్య కొండ మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు, రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల అన్నదానం నిర్వహణ పై ఆరా తీసి సంతృప్తి పనిచేశారు. మల్లయ్య కొండపై భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్వామి పుష్కరిణి, గౌరీ మాత ఆలయం, ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ లు పరిశీలించి సౌకర్యాలు పై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం ఆర్టీసీ సర్వీసులు నిర్వహణ భక్తుల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: