నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 12 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు 2024-2025 విద్యాసంవత్సరానికి గాను పరిశోధన అవార్డు ల కార్యక్రమాన్ని నిర్వహించినారు. యూనివర్సిటీ లోని అధ్యాపకులు మరియు విద్యార్థులు పరిశోధనలలో రాణిస్తున్నారని, ప్రతిభ కనపరిచిన వారికి నగదు బహుమతులు అందజేసినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన వెబ్ ఆఫ్ సైన్స్, స్కోపస్, ఎస్.సి.ఐ, ఐఈఈఈ మొదలైన వాటిలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పరిశోధన పత్రాలను ప్రచురించడం జరిగిందని, విద్యార్థులను మరియు అధ్యాపకులను మరింత ప్రోత్సాహం కొరకై ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని ఆయన అన్నారు. 21 లక్షల 31 వేలు రూపాయలను ప్రోత్సాహకాలుగా తమ యూనివర్సిటీ లోని 500 మంది అధ్యాపకులు మరియు విద్యార్థులు లబ్ది పొందారని ఆయన అన్నారు. ఈ ప్రోత్సాహకాలు అందించిన యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల మరియు ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకనాథ్ లకు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ కృతఙతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ , ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, అడ్వైసర్ (ఆర్&డి) డాక్టర్. తులసీరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డాక్టర్. శివయ్య, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీమంత బసు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News