నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 17 ః పెద్దేరు ప్రాజెక్ట్ ఆయకట్టు లోని గిరిజన రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల పలు రకాల పంటలకు శనివారం సాగునీరు విడుదల చేస్తున్నట్లు పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్, కమిటీ సభ్యులు తీర్మాణించారు.ప్రాజెక్టు పరిధి పెద్దమండెం మండలం లోని దేనేనాయక్ తండా,అవికే నాయక్ తాండ, వడ్డివంక తండా, తుమ్మలవంక తాండా, గరుగుమీద తాండాలకు చెందిన రైతుల పంటలు ఎలినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న విషయాన్ని జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డిల దృష్టికి తీసుకువెళ్లగా వారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పెద్దేరు ప్రాజెక్టు నుండి సాగు నీరు శనివారం ఒక్కరోజు విడుదల చేయాలని ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు, ఆయ కట్టు కమిటీకి సూచించారు. గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి అందరి ఆమోదంతో చైర్మన్ శివకుమార్ తో పాటు కమిటీ మెంబర్లు శనివారం ఒక్కరోజు నీటి విడుదలకు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ప్రాజెక్ట్ సాగునీటి విడుదల ప్రకటన పై గిరిజన రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు
Reporter
Namitha News