Friday, 31 July 2026 01:50:23 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మామిడి రైతులను గత ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసింది - టీడీపీ నేతల విమర్శలు

Date : 01 July 2026 06:25 PM Views : 95

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు జూలై 01 : పుంగనూరు స్థానిక మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామిడి రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని వారు అన్నారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శమీపతి యాదవ్ మాట్లాడుతూ..గత ఏడాది మామిడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైతులకు కిలో మామిడిపై రూ.4 సబ్సిడీ అందిస్తున్న విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చౌడేపల్లి, సోమల, దామలచెరువు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న మామిడి మండీలను బలవంతంగా తొలగించారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు సమీపంలోనే మామిడి మార్కెట్లను ఏర్పాటు చేసి, తమ పంటకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మామిడి రైతులకు అన్యాయం చేసింది ప్రస్తుత ప్రభుత్వం కాదని, గత ప్రభుత్వమే రైతుల ప్రయోజనాలను విస్మరించిందని టీడీపీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి,సి.వి.రెడ్డి పేర్కొన్నారు. ఇకనైనా మామిడి రైతులను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు,ధర్నాలు, రాస్తారోకోలు, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వారు సూచించారు. వాస్తవాలు ప్రజలకు తెలుసని, ఇటువంటి రాజకీయ ఆరోపణలను ప్రజలు విశ్వసించరని వారు స్పష్టం చేశారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :