నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 13 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ మరియు భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ), గాంధీనగర్, గుజరాత్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరినట్లు మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ అవగాహన ఒప్పందంపై ఎన్ఎఫ్ఎస్యూ గాంధీనగర్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. ఓ. జునారే మరియు మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్రిమినాలజీ, సైబర్ లా వంటి ఆధునిక మరియు అత్యంత ప్రాధాన్య రంగాల్లో సంయుక్త విద్యా, పరిశోధన మరియు వృత్తిపరమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మరియు అధ్యాపకుల ఎక్సచెంజ్ ప్రోగ్రామ్స్, నిపుణుల ఉపన్యాసాలు, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సులు, వర్క్షాప్లు, ఇంటర్న్షిప్లు, పరిశోధనా ప్రచురణలు, కన్సల్టెన్సీ సేవలు, పరిశోధన విద్యార్థుల సహ-పర్యవేక్షణ మొదలైన కార్యక్రమాలు అమలు చేయబడతాయని అన్నారు. పోలీసు శాఖ, దర్యాప్తు సంస్థలు, న్యాయ అమలు సంస్థలు మరియు ఫోరెన్సిక్ నిపుణుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సైబర్ భద్రత మరియు డిజిటల్ ఫోరెన్సిక్స్ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఈ రెండు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నైపుణ్యం, వనరులు మరియు పరిశోధన సామర్థ్యాల సమన్వయంతో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి మరియు పరిశ్రమ–విద్యా రంగాల అనుసంధానానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సి.ఎస్.ఈ - సైబర్ సెక్యూరిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మ ప్రకాష్ మరియు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ సి. డి. జడేజా అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News