Sunday, 02 August 2026 04:34:08 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ తో మిట్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం

Date : 13 June 2026 07:44 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 13 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ మరియు భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ), గాంధీనగర్, గుజరాత్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరినట్లు మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ అవగాహన ఒప్పందంపై ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ గాంధీనగర్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. ఓ. జునారే మరియు మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్రిమినాలజీ, సైబర్ లా వంటి ఆధునిక మరియు అత్యంత ప్రాధాన్య రంగాల్లో సంయుక్త విద్యా, పరిశోధన మరియు వృత్తిపరమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మరియు అధ్యాపకుల ఎక్సచెంజ్ ప్రోగ్రామ్స్, నిపుణుల ఉపన్యాసాలు, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధనా ప్రచురణలు, కన్సల్టెన్సీ సేవలు, పరిశోధన విద్యార్థుల సహ-పర్యవేక్షణ మొదలైన కార్యక్రమాలు అమలు చేయబడతాయని అన్నారు. పోలీసు శాఖ, దర్యాప్తు సంస్థలు, న్యాయ అమలు సంస్థలు మరియు ఫోరెన్సిక్ నిపుణుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సైబర్ భద్రత మరియు డిజిటల్ ఫోరెన్సిక్స్ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఈ రెండు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నైపుణ్యం, వనరులు మరియు పరిశోధన సామర్థ్యాల సమన్వయంతో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి మరియు పరిశ్రమ–విద్యా రంగాల అనుసంధానానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సి.ఎస్.ఈ - సైబర్ సెక్యూరిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మ ప్రకాష్ మరియు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ సి. డి. జడేజా అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: