Thursday, 30 July 2026 11:59:18 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె కు చెత్త తరలించే వాహనం అవశ్యం

సిబ్బంది కొరత, పారిశుధ్య పనులు ఆలస్యం

Date : 22 February 2026 08:39 AM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 21 : తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రం గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అయితే అందుకు తగ్గట్టు పారిశుద్ధ్య నిర్వహణ పనులు అంతంత మాత్రమే జరుగుతోంది. మండల కేంద్రంలో చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్ తో పాటు పారిశుద్ధ్య సిబ్బంది కేవలం నలుగురే ఉన్నారు. తంబళ్లపల్లె క్రాస్ రోడ్, సిద్ధారెడ్డి గారి పల్లి, కొండ కింద మేకల వారి పల్లి రహదారి, సప్తగిరి బ్యాంకు రహదారి, ఆర్టీసీ బస్టాండు, కోర్టు,మసీదు వీధి, జూనియర్ కాలేజ్, టి ఎన్ అరవింద రెడ్డి కాలనీ, పోలీస్ స్టేషన్, సాలి వీధి, విశ్వనాధ వీధి, వెంకటేశ్వర వీధి, దేవళం వీధి, కృష్ణానగర్, చర్చి వీధి, దళితవాడ, ప్రేమ్ నగర్ తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంతాలలో కేవలం నలుగురు సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేయడం కష్ట సాధ్యం. ట్రాక్టర్ సైతం సందు గొందుల్లో వెళ్ళడానికి వీలుపడక మారుమూల వీధుల్లో చెత్త పేరుకు పోతోంది. ప్రతినిత్యం వేల సంఖ్యలో మండల కేంద్రానికి ప్రజలు , అధికారుల రాకపోకలు జరుగుతుంటాయి. జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల పరిషత్ అధికారులు వెంటనే స్పందించి అదనంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించి మినీ చెత్త తరలించే వాహనాన్ని ఏర్పాటు చేయకపోతే తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం చెత్త కేంద్రంగా మారడం ఖాయం.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: