Thursday, 30 July 2026 02:12:29 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జిల్లా సమగ్రాభివృద్ధికి దృఢ ప్రణాళిక తో లక్ష్యం ను ఆదిగమించాలి - కలెక్టర్

పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి - పరిష్కారానికి బాధ్యతాయుతంగా సమన్వయంతో కృషి చేయాలి

Date : 01 May 2026 07:59 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 01 : జిల్లా సమగ్ర అభివృద్ధికి దృఢమైన ప్రణాళిక... వేగవంతమైన చర్యల అమలు లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, భూసంబంధిత అంశాలు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, వివిధ శాఖలలో అభివృద్ధి మరియు మౌలిక వసతులు తదితర అంశాలపై విస్తృత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరును సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి... పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల లక్ష్యం, సాధించిన ప్రగతిని సమీక్షించారు. రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి, 22A ఫైళ్లు, డాటెడ్ ల్యాండ్ కేసులు, ప్రత్యేక కేటగిరీ ROR కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. భూ రికార్డుల డిజిటైజేషన్ పూర్తి చేసి పారదర్శకతను పెంచాలని, ప్రభుత్వ భూముల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మదనపల్లి సమీపంలోని లేఅవుట్‌లలో ఖాళీ స్థలాలను గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రభుత్వ భూములపై కేఎంఎల్ ఫైళ్ల సిద్ధతను పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పనులకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులను త్వరగా విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని, సోలార్ పార్క్, పిఎం కుసుమ్ పథకాల భూసంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పరంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ, ఉప కాలువల భూసేకరణ, చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని, శ్రీనివాస పురం, అడవిపల్లి రిజర్వాయర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిశ్రమల అభివృద్ధి కోసం మైనింగ్ లీజుల ఎన్ఓసి లను త్వరగా క్లియర్ చేయాలని, వాటర్ గ్రిడ్ పనులకు అవసరమైన బ్లాస్టింగ్ అనుమతులను సమయానికి మంజూరు చేయాలని చెప్పారు. ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. టమోటా మార్కెట్ యార్డ్ మార్పిడి, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ డిపిఆర్ సిద్ధత, పీలేరు ఆర్డిఓ కార్యాలయం మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలను క్లెయిమ్ చేయని డిపాజిట్ల బదిలీ ప్రక్రియ, బ్యాలెన్స్ కౌంటర్ అఫిడవిట్స్, ఆటోమేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజా సానుకూల అవగాహన - సంతృప్తి స్థాయి పెరగాలి* రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలపై ప్రజా సానుకూల అవగాహనను పెంచాలి. చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సేవలపై ప్రజలలో తగిన అవగాహన కల్పించి సానుకూల దృక్పథం సంతృప్తస్థాయి పెరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పెండింగ్ అంశాలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు

ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :