నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 07 : బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో బాలికల జీవితాలు అంధకారంలో మునుగుతాయని జిల్లా చిల్డ్రన్ యూనిట్ కౌన్సిలర్ షకీలా భాను హితబోధ చేశారు. శనివారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల శారీరక, మానసిక, విద్య మరియు సామాజిక అభివృద్ధిని దెబ్బతీస్తాయన్నారు. దీంతోపాటు మాతృ మరణాలు, రక్తహీనత, పోషకాహార లోపం, చదువు మానేయడం వంటి తీవ్రమైన ఆరోగ్య విద్యా సంబంధిత అనర్థాలకు దారి తీస్తాయన్నారు. బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరు అవగాహన పొంది ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే నిరోదానికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజులు, చెంగన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News