Wednesday, 17 June 2026 02:54:28 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మైసూరులో చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడికి ఘన సత్కారం

Date : 22 April 2026 08:47 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైసూరులో చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడికి ఘన సత్కారం మత సామరస్యానికి సేవలకుగాను ఎంపీ ఆనందన్‌కు యు ఆర్ ఐ అవార్డు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్‌లో నిర్వహించిన యునైటెడ్ రిలిజియన్స్ ఇనిషియేటివ్ (యు ఆర్ ఐ) దక్షిణ భారత రాష్ట్రాల కోఆపరేటివ్ సర్కిల్స్ విస్తృత సమావేశంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్‌కు ప్రత్యేక అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. మతాంతర సౌహార్దం, శాంతి, న్యాయం మరియు సామాజిక సమగ్రత కోసం ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి (యు ఆర్ ఐ ) దక్షిణ భారత నాయకత్వం ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు, సంఘసంస్కర్తలు ఎంపీ ఆనందన్ సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రపంచ శాంతి స్థాపనలో యు ఆర్ ఐ 109 దేశాల్లో పనిచేస్తోందని, కుల మతాలకు అతీతంగా ప్రతి మనిషిని సమానంగా గౌరవించడం అవసరమని తెలిపారు. ప్రతి మతం మానవత్వాన్ని బోధిస్తుందని, మానవసేవే మాధవసేవ అని పేర్కొంటూ సమాజంలో మానవీయ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వచ్చిన కోఆపరేటివ్ సర్కిల్స్ ప్రతినిధులు పాల్గొని మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సత్కారం అందుకున్న వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ఈ గౌరవం తనకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యానికి కృషి చేస్తున్న అందరికీ దక్కినదేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా శాంతి, న్యాయం, మానవ విలువల పరిరక్షణ కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ కోఆర్డినేటర్ వి.ఎస్. రెడ్డి, ఆసియా కోఆర్డినేటర్ డాక్టర్ అబ్రహం కారికమ్, కర్ణాటక స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ వర్షా, మత్తయి కుట్టి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :