Thursday, 30 July 2026 12:16:38 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మౌంటేన్ అడ్వన్చర్ క్యాంప్ లో ప్రతిభ కనబర్చిన మిట్స్ ఎన్.సి.సి. విద్యార్థులు

Date : 08 May 2026 09:05 PM Views : 116

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని యెన్.సి.సి క్యాడెట్లు గంగరపు జ్యోతీశ్వర్, రామిరెడ్డి లక్ష్మణ్ మరియు ఎమ్ భార్గవి లు భారతీయ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో-టూరిజం నిర్వహించిన నేషనల్ లెవెల్ అడ్వెంచర్ మరియు మౌంటెనీరింగ్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేసారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. సిక్కింలోని చెమ్చేలో ఉన్న ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో-టూరిజం (IHCAE) ఉన్నత స్థాయి పర్వతారోహణ శిక్షణ మరియు పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ అని ఆయన అన్నారు. ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (IMF) గుర్తింపు పొందిన ఈ కేంద్రం పర్వతారోహణ, రాక్ క్రాఫ్ట్ మరియు ఐస్ క్రాఫ్ట్ వంటి రంగాలలో అత్యుత్తమ శిక్షణను అందిస్తోందని తెలిపారు. ఈ శిక్షణలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలనుండి 15 మంది క్యాడెట్స్ పాల్గొనగా, అందులో మిట్స్ విద్యార్థులు పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. సుమారు 6,582 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ ప్రాంతాలలో ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్ మరియు పారాగ్లైడింగ్ వంటి సాహస కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ శారీరక దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకున్నారని అన్నారు . అదేవిధంగా పర్వతారోహణ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి కఠిన శిక్షణల ద్వారా ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ జట్టు భావనతో పని చేయడం, దేశ సేవకు సిద్ధమవడం వంటి విలువలు పెంపొందుతాయని అన్నారు . ప్రతి క్యాడెట్ కూడా తమ వంతు దేశ రక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం యెన్.సి.సి క్యాడెట్స్ తమ యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకువస్తున్నారని, జాతీయ స్థాయి వేదికలపై ఇటువంటి శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, సాహస స్ఫూర్తి మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో మిట్స్ యూనివర్సిటీ అగ్రగామిగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి క్యాంప్ కోర్స్ డైరెక్టర్ కాజీ షెర్పా మరియు ట్రైనింగ్ ఆఫీసర్ నకుల్ గిరి పర్యవేక్షణ వహించినట్లు తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన యెన్ సి సి విద్యార్థులు యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్, 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్ ఎన్.వి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ మరియు తదితరులు అభినందనలు తెలియజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :