నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 15 ః తంబళ్లపల్లె మండలంలోని రైతులకు శనివారం సబ్సిడీ ఉలవలు టిడిపి నాయకులు పంపిణీ చేశారు. ఉదయం తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీల సచివాలయాలలో ఎఈఓలు సురేష్, రెడ్డి శేఖర్ ల ఆధ్వర్యంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, ముద్దల దొడ్డి వెంకటరెడ్డి లు రైతులకు సబ్సిడీ ఉలవలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఈఓలు మాట్లాడుతూ మండలానికి 200 క్వింటాళ్ల ఉలవలు వచ్చాయని 10 కిలోల ఉలవలు సంచి రూ120 చొప్పున పాస్ బుక్ కలిగిన రైతులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, రామచంద్ర, సుధాకర, శివకుమార్, సుధాకర్ రెడ్డి, జనసేన మండల నాయకుడు ఎద్దులవారికోట నరసింహులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News