నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 17 : ఆత్మకూరు ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ ప్రభంజనం సృష్టించింది.. 45 వరకు రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకుల సాధించడం గొప్ప విశేషం.. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరంలో వచ్చిన ఫలితాలలో జిల్లాలోని అత్యధిక ర్యాంకులు సాధించడం ఈ ఏడాది ప్రత్యేకత.. జిల్లా స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు రాష్ట్రస్థాయిలో ఐదు ర్యాంకులు సాధించి ఆత్మకూరు చరిత్రలోనే గొప్ప ప్రభంజనంగా ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది నిలవడం విశేషం.. ఈ క్రమంలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. తమ బిడ్డలకు మంచి విద్యను అందించి జిల్లా ర్యాంకులు సాధించడంలో సహకరించిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ధన్యవాదాలు తెలిపారు.. ప్రియదర్శిని కాలేజీలో తమకు అందించిన ఉత్తమ బోధనతోనే తాము మంచి ర్యాంకులతో పాస్ కావడానికి కారణమని అందుకు ఉపాధ్యాయులకు కాలేజ్ యాజమాన్యానికి రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు.. ఆత్మకూరు పట్టణంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి అత్యధిక పాస్ శాతం పొందడం సంతోషంగా ఉందని కాలేజీ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు రెడ్డి మరియు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు తినిపించి బొకేతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 670 మంది విద్యార్థులతో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిగిన కళాశాల తమదేనని గత ఏడాది రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకుతో పాటు ఈ ఏడాది మొదటి మూడు ర్యాంకులు మరియు అత్యధిక ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషకరమని తమ విద్యా బోధన క్రమశిక్షణతో తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును తమ చేతిలో పెడుతున్నారని అందుకే తాము తమ సిబ్బంది ఎంతో కృషిచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు
Reporter
Namitha News