Thursday, 30 July 2026 08:17:18 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం - జిల్లా డిప్యూటీ సిఈవో మోహన్ రావు

Date : 18 December 2025 04:13 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - డిసెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా మరో వంద రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున పదో తరగతి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ విద్యార్థులలో ఉత్తీర్ణశాతం పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది. నేడు ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ రాజ్ జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆత్మకూరు తాహసిల్దార్ పద్మజా, ఎంపీడీవో రఫీ ఖాన్, మండల MEO కె.చలపతితో పాటు మండలంలోని పదవ తరగతి విద్యార్థులు ఉన్న 13 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరియు 13 పాఠశాలలకు ప్రత్యేకంగా నియమించబడిన 13 మంది ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా పదవ తరగతి విద్యార్థులలో చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు చేపట్టి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం కోసమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని వీరు తరచూ పాఠశాలను సందర్శిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని తెలిపారు.. తెలిపారు..పలువురు హెడ్మాస్టర్లు అడిగిన ప్రశ్నలకు మోహన్ రావు సమాధానం తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :