Tuesday, 09 June 2026 08:17:42 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

మల్లయ్య కొండల మైనింగ్ మానవాళికి పెనుముప్పు - బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు జల్లా లలితమ్మ

Date : 29 May 2026 08:48 PM Views : 70

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 ః లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం ముక్కంటి నిలయాలుగా నిలిచిన తంబళ్లపల్లె (సాధు, ఇనుము, మల్లయ్య) మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది జీవరాశులు, మూగజీవాలు, వేలాదిమంది అటవీ శివార్ల ప్రజలు జీవనోపాధి కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో పర్యావరణం కాలుష్యమై మానవాళికి పెనుముప్పు ఏర్పడుతుందని బాలల హక్కుల ప్రజా ధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు జల్లా లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు ఆ మహా శివుడు సాదుకొండ నుండి సొరంగ మార్గంలో ఇనుము కొండ ద్వారా మల్లయ్య కొండ చేరి స్థిరపడినట్లు పురాణాలు చెబుతున్నాయని దీంతోపాటు స్థానిక లక్షలాది శివ భక్తుల మనోభావాలను ప్రభుత్వాలు గుర్తించాలని ఈ ప్రాంతంలో మైనింగ్ చేపడితే వాతావరణ కాలుష్యం, దుమ్ము ధూళి తో అనారోగ్యాలు, భూములు నిస్సారమై పంటలకు పనికి రాకుండా పోయి ఎడారి ప్రాంతం లా మారుతుందని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. నేడు తంబళ్లపల్లె ప్రాంతానికి మల్లయ్య కొండలు పెట్టని కోటలా అటవీ ప్రాంతం పచ్చటి పర్యావరణం, లక్షలాది వన్యప్రాణులు, పశు పక్షాదులు, జీవరాసులు ఆశ్రయం కోల్పోవడంతో పాటు ఈ కొండలను నమ్ముకున్న కొండ శివారు ప్రాంతాలలోని వందలాది గ్రామాల ప్రజలు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. మల్లయ్య కొండ ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి వైపు నడిచి లక్షలాదిమంది భక్తులకు మహాశివుడు ఆరాధ్య దైవంగా నిలిచాడని ఇలాంటి పవిత్రమైన కొండలను మైనింగ్ కు అప్పజెప్పడం స్థానిక ప్రజలకు శరాఘాతంగా తయారవుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మైనింగ్ కార్యక్రమాలను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :