నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మే 28వ తేదీ తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకొని 27, 28వ తేదీ లలో నిర్వహించిన మహానాడు లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా బిల్లు తో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించడం తో నేడు మదనపల్లి పట్టణం లోని దేవతా నగర్ పార్లమెంట్ తెదేపా కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ భాష పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు మహిళలు, రాష్ట్రస్థాయి, నియోజవర్గ స్థాయి గ్రామస్థాయిలో వివిధ హోదాలలో ఉన్న మహిళ లతో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ , జిల్లా అధ్యక్షుడు సుగువాసి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గా నందమూరి తారక రామారావు మహిళలకు తండ్రి ఆస్తులు హక్కు కల్పించడం జరిగిందని, చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి దీపం కనెక్షన్లు అందించారని, 2026 మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం హర్షించ దగ్గ విషయమని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తులసి రామకృష్ణ, రాష్ట్రస్థాయి మహిళా నేత పర్వీన్ తాజ్, జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి రాధా, మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి, లక్ష్మీదేవి, జాఫరున్నిసా,రాటకొండ భారతి నాయుడు, శ్రీరామ నాగమణి, విజయమ్మ, వేంపల్లి భారతి నాయుడు , సోమశేఖర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ రాజ్ కుమార్, మంగళ ప్రభాకర్, శ్యామలమ్మ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News