నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - మే 30 : ఆత్మకూరు సర్కిల్ పరిధిలో మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్ల ను పగలగొట్టి దొంగతనం కు పాల్పడిన నలుగురు దొంగల ముఠా ను ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు ఆత్మకూరు సిఐ గంగాధర్ మాట్లాడుతూ ఆత్మకూరు సమీపంలో అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి చోరీకి పాల్పడుతున్న ఈ నలుగురిని పట్టుకున్నామని వీరు గతంలో ఆరు మండలాలలో దొంగతనాలకు పాల్పడి 19 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి చోరీకి పాల్పడిన్నట్లు వాటిని పగలగొట్టి సొమ్ము చేసుకొన్నట్లుగా వారి నుండీ రూ 2,31,000 సొత్తును పోలీసులు రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగలను పట్టుకోడానికి సహకరించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ తో పాటు ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్, ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News