నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 13 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 - జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా విద్యార్థులు యూనివర్సిటీ నందు ఫ్లాష్ మొబ్బ్ ను ఏర్పాటు చేసి వివిధ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ అలరించనున్నారు. ఈ నెల 25 మరియు 26 వ తేదీలలో రెండు రోజుల పాటు యూనివర్సిటీ నందు వివిధ పోటీలను నిర్వహిస్తామని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఇందులో జాతీయ స్థాయిలో డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని, వివరాలు కళాశాల అశ్వ్ వెబ్ సైట్ www.ashv2k.in లేదా www.mits.ac.in లో పొందుపరిచామని ఆయన అన్నారు. ఈ వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పోటీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని, ఈ కార్యక్రమం లో ప్రతి ఏటా సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరిస్తారని, ఈ సారి 26 వ తేదీన సినీ హీరో శర్వానంద్ మరియు 25 న నేపధ్య గాయకులు సాగర్, లిప్సిక భాష్యం మరియు మౌనిక యాదవ్ లు నేపథ్య గాయకులు మరియు జబర్దస్త్ టీం మెంబెర్స్ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం లో మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యన్ విజయ భాస్కర్ చౌదరి ప్రో ఛాన్సల్లర్ యెన్. ద్వారకానాథ్, కళాశాల అశ్వ్ - 2026 కన్వీనర్ మరియు వైస్ ప్రిన్సిపాల్ కమాల్ బాషా, కో - కన్వీనర్ ప్రదీప్ కుమార్ స్టూడెంట్ కో ఆర్డినేటర్స్ హర్ష , జయరాం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News