నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 ః ప్రభుత్వ పథకాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో భవిష్యత్తులో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని పరిశ్రమల ప్రోత్సాహిక అధికారులు డి శంకరప్ప, కే నాగార్జునలు సూచించారు. శుక్రవారం శ్రీ శక్తి భవన్ లో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం సారథ్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ నిర్వహించారు. మహిళలు వ్యాపార ప్రణాళికలతో అవగాహన పొంది బ్యాంకుల ద్వారా ముద్ర, పిఎం ఈజిపి రుణాలు పొంది వ్యాపార, సేవాపరిశ్రమల రంగాలలో వారికి అవసరమైన ఉద్యం రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు. మహిళలు వ్యాపారాలపై అవగాహన పొంది వినూత్న ఉత్పత్తి రంగాల అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. తద్వారా ఆన్లైన్ చేసుకొని రుణం పొంది 35% సబ్సిడీ గ్రహించాలన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, యానిమేటర్లు, ఎస్ హెచ్ జి సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News