నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 29 : మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష సిఫారసులపై బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. మదనపల్లి మండలం లోని పది మంది లబ్దిదారులకు మంజూరైన పైకం13లక్షల రూపాయలను లబ్దిదారులకు చెక్కుల రూపం లో పంపిణీ చేశారు. అంకిశెట్టి పంచాయతీ సురభి కాలనీ లోని ఇంతియాజ్, ఊట నాగేంద్ర, రామాపురం వాసి దొమ్మర హరిప్రసాద్, వేంపల్లి కస్పా నివాసి కేశర్ల శేఖర్ బాబు, వేంపల్లి వాసి ఈశ్వరమ్మ, కోనకుంట్ల వెంకటరమణ, తంబా రంజిత్ కుమార్, పొన్నూటి పాళ్యం పంచాయితీకి చెందిన పనసమాకుల పల్లి కి చెందిన ముదివేటి సాయిప్రతాప్ రెడ్డి, మృతిచెందిన శివశంకర్ భార్య అంజలి లకు మంజూరైన సి.యం. రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ, మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News