నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 05 : మదనపల్లి సమీపం అంగళ్ళు లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్, ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె. పద్మనాభం, సీఈఓ, పవన్ ఎంపవర్ సొల్యూషన్స్, పలమనేరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడల రంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండింగ్, మరియు పేటెంట్ల పాత్ర ఎంతో కీలకమని, యువత ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ సంస్థ చేపడుతున్న చౌకైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి పరిష్కారాలు మరియు సామాజిక ఉపయోగాల కోసం రూపొందించిన సాంకేతిక పరికరాల గురించి వివరిస్తూ, గ్రామీణ స్థాయి ఆలోచనలను స్టార్టప్లుగా అభివృద్ధి చేయడానికి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు మరియు పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థాపకత, మేధస్సు హక్కుల సంరక్షణ మరియు సమాజ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలపై విద్యార్థులకు అవగాహన కలిపించారు. నవ భారత్ నిర్మాణంలో మేధో సంపత్తి హక్కుల పరిరక్షణే పునాది అని, ప్రతి ఒక్కరూ తమ వినూత్న ఆలోచనలకు రక్షణ కల్పించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డాక్టర్ పి.శివయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News