Friday, 31 July 2026 04:40:08 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

లోక కల్యాణం కోసం ఆత్మార్పణం చేసిన త్యాగమూర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు - జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి

Date : 20 January 2026 01:36 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 20 : సమాజ శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం అహింసా మార్గంలో అగ్ని ప్రవేశం చేసిన త్యాగమూర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని (మాఘ శుద్ధ విదియ) పురస్కరించుకుని, అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అమ్మవారికి ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆత్మార్పణ వెనుక ఉన్న పురాణ విశిష్టతను మరియు ఆమె త్యాగాన్ని కొనియాడారు. పురాణాల ప్రకారం, పార్వతీ దేవి పరమశివుడిని వివాహం చేసుకోవడానికి కన్యగా ఉండి ఘోర తపస్సు చేశారు. అయితే లోక కంటకుడైన బాణాసురుడిని సంహరించడం కోసం తన తపస్సు పూర్తి కాకముందే, భక్తుల కోరిక మేరకు శివకళ్యాణం జరగకుండా ఆగిపోయి, అమ్మవారు కన్యా రూపంలోనే ఉండిపోయారు. వివాహం పూర్తి కాకపోయినా, తపస్సు అసంపూర్తిగా ఉన్నా, తన భక్తుల రక్షణ కోసం అక్కడే కొలువై ఉండాలని నిర్ణయించుకున్న ఆ మహా తల్లిని మనం పూజిస్తున్నాము. ఆమె ఆత్మార్పణకు గుర్తుగా కన్యకా పరమేశ్వరి రూపంలో వెలసి నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. "అహింసా పరమోధర్మః" అనే నినాదంతో సమాజ హితం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె మార్గం నేటి మహిళా సాధికారతకు, సామాజిక బాధ్యతకు దిక్సూచి అని అదనపు ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని, జిల్లా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యం.పెద్దయ్య, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. శంకర మల్లయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు హోంగార్డులు పాల్గొని అమ్మవారికి నివాళులర్పించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :