నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 16 : వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు జి. వరదా రెడ్డి ని వైఎస్సార్ సిపి పార్టీ కేంద్ర కార్యాలయం నియమించడం జరిగిందని తెలిపారు . ఈ సందర్బంగా నేడు హైదరాబాద్ లో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కలసి వైఎస్సార్ సిపి పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని, నాకు ఈ భాద్యతలు అప్పగించిన మాజీ సీఎం. జగన్మోహన్ రెడ్డి గారికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ పుంగనూరు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పాటు నిస్తూ పార్టీ భలోపేతం కు కృషి చేస్తానని తెలియచేసారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని నేరుగా కలసి కృతజ్ఞతలు తెలియజేసానని తెలిపిన వరదా రెడ్డి
Reporter
Namitha News