నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 24 ః తంబళ్లపల్లె మండలంలో జరగాల్సిన మండల అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కల్పించాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మహిళా నేత సిద్ధమ్మ, బీసీ నాయకుడు పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, గోపిదిన్నె హైస్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజులు, బీసీ నేత నరేంద్ర నాయుడు, రామకృష్ణ లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా లను కోరారు. మండలంలో వేసవి దృశ్య పలుచోట్ల తాగునీటి, మౌలిక సమస్యలు పరిష్కారానికి సహకరించాలని కోరారు
Reporter
Namitha News