Sunday, 02 August 2026 04:34:50 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే

28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 లను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు

Date : 18 April 2026 08:57 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 18 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు 28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సందీప్ బడద్ 2025 (UPSC) యూ పిఎస్ సి సివిల్ సర్వీసెస్, 82వ ఆల్ ఇండియా ర్యాంకర్, శ్రీనివాస్ పి.సి, ఫౌండర్ & సి ఈ ఓ, ఇండియా 4IAS అకాడమీ మరియు ప్రశాంత్ శ్రీనివాస్, కో-ఫౌండర్ & డైరెక్టర్, బెంగళూరు,కర్ణాటక పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ యెన్. ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మరియు ముఖ్య అతిధులు సందీప్ బడద్ జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ముఖ్య అతిథి సందీప్ బడద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో తన అనుభవాలను పంచుకుంటూ, విజయం ఒక్క రోజులో రాదని, నిరంతర కృషి, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం ఉంటేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనమని అన్నారు. ఈ నైపుణ్యాలు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు కాలేజీ జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రతిరోజూ కొంత సమయం తమ లక్ష్యాల కోసం కేటాయించాలని, ముఖ్యంగా పత్రికలు చదవడం, ప్రస్తుత అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం, సమాజ సమస్యలపై స్పందన కలిగి ఉండడం చాలా అవసరమని సూచించారు. ఆనందంతో పాటు భవిష్యత్తుపై బాధ్యతతో కూడిన ఆలోచన అవసరమని, పట్టభద్రులైన వెంటనే వ్యక్తిగత మరియు కుటుంబ బాధ్యతలు వస్తాయని గుర్తు చేశారు. అందువల్ల కాలేజీ జీవితం ఆస్వాదిస్తూ, తమ కలలను సాధించడానికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. అలాగే లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడానికి కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించి తల్లిదండ్రులకు గర్వకారణమవుతారని తెలిపారు. యువతే దేశ భవిష్యత్తు అని గుర్తుంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీ అందించిన నాణ్యమైన విద్య ద్వారా విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ గత సంవత్సరంలో యూనివర్సిటీ యొక్క విద్యా విజయాలు, నియామకాలు మరియు పరిశోధన సహకారాలను హైలైట్ చేస్తూ వార్షిక నివేదికను సమర్పించారు. ఆ తరువాత వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థి అవార్డులు మరియు గుర్తింపులు సాయంత్రం ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమములో వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: