Wednesday, 17 June 2026 02:50:26 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే

28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 లను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు

Date : 18 April 2026 08:57 PM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 18 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు 28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సందీప్ బడద్ 2025 (UPSC) యూ పిఎస్ సి సివిల్ సర్వీసెస్, 82వ ఆల్ ఇండియా ర్యాంకర్, శ్రీనివాస్ పి.సి, ఫౌండర్ & సి ఈ ఓ, ఇండియా 4IAS అకాడమీ మరియు ప్రశాంత్ శ్రీనివాస్, కో-ఫౌండర్ & డైరెక్టర్, బెంగళూరు,కర్ణాటక పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ యెన్. ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మరియు ముఖ్య అతిధులు సందీప్ బడద్ జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ముఖ్య అతిథి సందీప్ బడద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో తన అనుభవాలను పంచుకుంటూ, విజయం ఒక్క రోజులో రాదని, నిరంతర కృషి, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం ఉంటేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనమని అన్నారు. ఈ నైపుణ్యాలు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు కాలేజీ జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రతిరోజూ కొంత సమయం తమ లక్ష్యాల కోసం కేటాయించాలని, ముఖ్యంగా పత్రికలు చదవడం, ప్రస్తుత అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం, సమాజ సమస్యలపై స్పందన కలిగి ఉండడం చాలా అవసరమని సూచించారు. ఆనందంతో పాటు భవిష్యత్తుపై బాధ్యతతో కూడిన ఆలోచన అవసరమని, పట్టభద్రులైన వెంటనే వ్యక్తిగత మరియు కుటుంబ బాధ్యతలు వస్తాయని గుర్తు చేశారు. అందువల్ల కాలేజీ జీవితం ఆస్వాదిస్తూ, తమ కలలను సాధించడానికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. అలాగే లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడానికి కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించి తల్లిదండ్రులకు గర్వకారణమవుతారని తెలిపారు. యువతే దేశ భవిష్యత్తు అని గుర్తుంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీ అందించిన నాణ్యమైన విద్య ద్వారా విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ గత సంవత్సరంలో యూనివర్సిటీ యొక్క విద్యా విజయాలు, నియామకాలు మరియు పరిశోధన సహకారాలను హైలైట్ చేస్తూ వార్షిక నివేదికను సమర్పించారు. ఆ తరువాత వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థి అవార్డులు మరియు గుర్తింపులు సాయంత్రం ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమములో వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: