Friday, 31 July 2026 01:33:56 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

సర్వమతాలకు అతీతం కడప అమీన్ పీర్ దర్గా.... గంధోత్సవంలో పాల్గొని ఛాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్

Date : 08 November 2025 07:50 AM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సర్వమతాలకు అతీతం కడప అమీన్ పీర్ దర్గా.... గంధోత్సవంలో పాల్గొని ఛాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్.... దేశంలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన కడప అమీన్‌ పీర్‌ పెద్ద దర్గాలో వెలసిన హజరత్‌ సరమస్త్‌సాని చల్లాకష్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్‌ మహమ్మదుల్‌ హుసేనీ చిస్టివుల్‌ ఖాద్రి ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమైన అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవంలో నిస్సార్ అహమ్మద్ పాల్గొని చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కడప జిల్లాలోని పెద్ద దర్గాకు విశిష్ట ప్రాముఖ్యత ఉందని, సర్వమతాలకు అతీతంగా ఇక్కడ భక్తులు వచ్చి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారని వివరించారు. అమీన్ పీర్ దర్గా వ్యవస్థాపకుడు హజరత్ పీరుల్లా మాలిక్, ఇక్కడ పెద్ద ఉరుసును మాత్రం సూఫీ సర్ మస్తానీ ఆరీఫుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టివుల్ ఖాద్రి పేరిట నిర్వహిస్తారని, కాలక్రమేణా అమీర్ పీర్ దర్గాగా పేరొందిందని, ప్రస్తుతం ఈ దర్గా 11వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ ఆరీఫుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టివుల్ ఖాద్రి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.కడప పెద్ద దర్గా సందర్శించడానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది ప్రముఖులు హాజరవుతారని అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగే ఉరుసు ఉత్సవంలో పాల్గొనటానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :