నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 05 : మదనపల్లి మునిసిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష తన చేతుల మీదుగా కూలింగ్ వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులతో నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కోసం వారు పని చేసే క్లస్టర్ ఏరియాలో 8 చోట్ల వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే సందర్శకుల కోసం కార్యాలయంలో రెండు కూలింగ్ వాటర్ ఫిల్టర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదేవ నాయుడు, ఎస్సార్ షంషీర్, ఆర్కె రామకృష్ణ ఆచారి, జాన్ బాబు, రమేష్ రెడ్డి, రెడ్డి రాయల్, జాఫరున్నిసా, నాగమణి, ఇక్బాల్, మల్లికార్జున్ నాయుడు, ఆర్ఆర్ వీధి మంజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News