Thursday, 30 July 2026 08:58:05 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి జిల్లా ఏర్పాటుతో నెరవేరిన ప్రజల ఆకాంక్ష

Date : 26 November 2025 07:14 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లా ఏర్పాటుతో నెరవేరిన ప్రజల ఆకాంక్ష - ఆర్టీసీ 1,2 డిపోల గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హర్షం - సీఎం చంద్రబాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు మదనపల్లె : మదనపల్లి జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిందని మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మదనపల్లి పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.ప్రస్తుతం జిల్లాగా ఏర్పాటు చేసి ఆ హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు.గత వైసిపి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఇక్కడి ప్రజల మనోభావాలను,ప్రజాసంఘాల ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకుండా మదనపల్లిని జిల్లా చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.దీంతో అప్పుడు తెలుగుదేశం పార్టీలో తమతోపాటు వివిధ ప్రజాసంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు.వైసిపి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా మదనపల్లి జిల్లా కోసం పోరాట పోరాటాలు చేశామని గుర్తు చేశారు.ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన,ప్రశాంతమైన వాతావరణం కలిగిన మదనపల్లి జిల్లాగా ప్రకటించిన ఈరోజు ఇక్కడి ప్రజలకు పండుగ రోజు అని కొనియాడారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు మదనపల్లి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :