నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 5 ( నేటి మన దేశం ప్రతినిధి) విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల తో పాటు ఇంటి నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలక పాత్ర పోషించాలని ఎంఈఓ త్యాగరాజు సూచించారు. శుక్రవారం ప్రభుత్వాదేశాల మేరకు మండలంలోని 68 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలలో పేరెంట్స్ మీటింగ్ 3.0 ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కోసువారిపల్లి హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పాటించి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను గౌరవించడం, సెల్ఫోన్ వాడకం తగ్గించి విద్యలో రాణించడానికి అభ్యసన స్థాయి పెంపు, క్రీడల్లో నైపుణ్యం, గ్రంథాలయ పఠణం, మహిళలకు గౌరవం, బాల్య వివాహాల నిలుపుదల తోబాటు టెన్త్ క్లాస్ విద్యార్థులు నిరంతర శ్రమ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రుల పూర్తి సహకారం అందించాలన్నారు. తంబళ్లపల్లె కేజీ బివిలో కనుగొండ మద్ది రెడ్డి, ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, గోపి దిన్ హై స్కూల్లో సిడిపిఓ సుజాత, కన్నెముడు హైస్కూల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ జి వినోద్ కుమార్, తంబళ్లపల్లి హైస్కూల్లో కమిటీ చైర్మన్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ గురుకులంలో ఎంపీడీవో పట్నాయక్, ప్రిన్సిపాల్ ఆంజనేయ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసినట్టు చెప్పారు.
Reporter
Namitha News