Wednesday, 17 June 2026 02:49:30 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు

Date : 19 April 2026 06:13 PM Views : 96

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు బోధిసత్వ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన శీలవంతమైన మార్గంలో యువత నడవాలని, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) యువజన విభాగం నేతలు పిలుపునిచ్చారు. "యువత - నైతికత" అన్న అంశంపై ఆదివారం ప్రెస్ క్లబ్ లో, బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్బంగా జరిగిన విలేకర్ల సమావేశంలో బాస్ యువజన విభాగం నాయకులు బైనేని సురేష్, నీరుగట్టి రాజేష్, పి. పృద్విరాజ్, చాట్ల కళ్యాణ్, ఆర్. మహేంద్ర, కె. తేజ, ఎస్. ఈశ్వర్ లు మాట్లాడుతూ యువతను సరైన మార్గంలో నడిపించే స్పష్టమైన కార్యక్రమం ఏదీ ప్రభుత్వం వద్ద లేకపోవడం వల్ల, యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత నైతికతతో పునీతమైతే దేశం ఘననీయమైన పురోగతిని సాధిస్తుందని అభిప్రాయ పడ్డారు. యువతలో నైతికతను పెంపొందించడానికి వారికి అంబేడ్కర్ ను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత అంబేడ్కర్ మార్గంలో నడిపిస్తే, దేశంలో గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. యువతను చైతన్య పరిచి, అంబేడ్కర్ మార్గంలో నడిపించడానికి, బాస్ యువజన విభాగం కృషి చేస్తుందని తెలిపారు. బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి ముందస్తు వేడుకలు విజయవంతం చేసిన బాస్ కుటుంబ సభ్యులకు, అంబేడ్కర్ అభిమానులకు వీరు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి పోతబోలు రెడ్డెప్ప, బాస్ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్, ఉద్యోగ సంఘ నాయకులు చిట్టిబాబు, చిన్నప్పలతో పాటు బాస్ నాయకులు నీరుగట్టి రమణ, గంపల రమణ, సొన్నికంటి రెడ్డెప్ప, డేగాని రమణ, వై. గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, కృష్ణ, జనార్దన్, శశిధర్, ప్రశాంత్, తరుణ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: