Thursday, 30 April 2026 09:21:30 PM
# జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత # మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ # మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘన నివాళులు - ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం # వివాహా వేడుకలలో శ్రీరాం చినబాబు # అయ్యప్ప స్వామి ద్వజస్తంభన కార్యక్రమం లో శ్రీరామ్ చినబాబు # శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు # కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ? # నారా లోకేష్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే షాజహాన్ # నమిత న్యూస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కృష్ణ చరణ్ # గ్రీన్ అంబాసిడర్లు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలి -ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ # గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... ! # నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి # పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు # రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు # మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు # జర్నలిస్ట్ హత్య ను నిరసిస్తూ పుంగనూరు పట్టణం లోని జర్నలిస్ట్లు ఆందోళన, నిరసన # వి.కోట లో విలేకరి జగన్ దారుణహత్య # ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు # మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు

Date : 19 April 2026 06:13 PM Views : 45

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు బోధిసత్వ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన శీలవంతమైన మార్గంలో యువత నడవాలని, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) యువజన విభాగం నేతలు పిలుపునిచ్చారు. "యువత - నైతికత" అన్న అంశంపై ఆదివారం ప్రెస్ క్లబ్ లో, బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్బంగా జరిగిన విలేకర్ల సమావేశంలో బాస్ యువజన విభాగం నాయకులు బైనేని సురేష్, నీరుగట్టి రాజేష్, పి. పృద్విరాజ్, చాట్ల కళ్యాణ్, ఆర్. మహేంద్ర, కె. తేజ, ఎస్. ఈశ్వర్ లు మాట్లాడుతూ యువతను సరైన మార్గంలో నడిపించే స్పష్టమైన కార్యక్రమం ఏదీ ప్రభుత్వం వద్ద లేకపోవడం వల్ల, యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత నైతికతతో పునీతమైతే దేశం ఘననీయమైన పురోగతిని సాధిస్తుందని అభిప్రాయ పడ్డారు. యువతలో నైతికతను పెంపొందించడానికి వారికి అంబేడ్కర్ ను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత అంబేడ్కర్ మార్గంలో నడిపిస్తే, దేశంలో గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. యువతను చైతన్య పరిచి, అంబేడ్కర్ మార్గంలో నడిపించడానికి, బాస్ యువజన విభాగం కృషి చేస్తుందని తెలిపారు. బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి ముందస్తు వేడుకలు విజయవంతం చేసిన బాస్ కుటుంబ సభ్యులకు, అంబేడ్కర్ అభిమానులకు వీరు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి పోతబోలు రెడ్డెప్ప, బాస్ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్, ఉద్యోగ సంఘ నాయకులు చిట్టిబాబు, చిన్నప్పలతో పాటు బాస్ నాయకులు నీరుగట్టి రమణ, గంపల రమణ, సొన్నికంటి రెడ్డెప్ప, డేగాని రమణ, వై. గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, కృష్ణ, జనార్దన్, శశిధర్, ప్రశాంత్, తరుణ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :