నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి మే 28 : తంబళ్లపల్లె మండలంలో ముస్లిం సోదరులు గురువారం బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం తంబళ్లపల్లె పెద్ద మసీదు, సిద్ధారెడ్డి గారిపల్లిమసీదు కు చెందిన ముస్లిం సోదరులు మసీదు నుండి ఖురాన్ పటిస్తూ క్రాస్ రోడ్ లోని ఈద్గా వద్దకు చేరుకున్నారు. మత గురువులు బక్రీద్ పండుగ పవిత్రతను బోధించారు.సందర్భంగా ముస్లిం సోదరులు అల్లాను సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు దానధర్మాలు చేపట్టారు. మండలంలోని కోసువారిపల్లి, గోపి దీన్నే, కొటాల, రేణిమాకులపల్లి, కుక్కరాజుపల్లి, ఎద్దుల వారి పల్లి, గంగిరెడ్డిపల్లి మసీదులలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించి పేదలకు దానధర్మాలు చేపట్టి పరస్పరం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు
Reporter
Namitha News