Thursday, 30 July 2026 06:15:07 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

దివంగత నేత మాజీ పి.యం. వాజ్ పాయ్ విగ్రహ ప్రతిష్టకు తరలిరండి - చల్లపల్లి నరసింహారెడ్డి

Date : 08 December 2025 09:59 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 08 : భారతదేశానికి పాలనా సంస్కరణల ఆధ్యుడు దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ విగ్రహ ప్రతిష్ట ఈనెల 14వ తేదీన మదనపల్లెలో జరిగే కార్యక్రమానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బిజెపికి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి బలోపేతానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ చేసిన కృషి వర్ణనాతీతమన్నారు. బిజెపి తొలి ప్రధానిగా తొలుత 13 రోజులు పనిచేసి ప్రలోభాలకు లోను కాకుండా పదవి త్యాగం చేసిన రాజకీయ దురందరుడని కొనియాడారు. ప్రధానిగా ఆయన చేసిన ప్రజాసేవ తో పాటు బిజెపి నేడు పాలనలో అగ్రస్థానంలో నిలవడానికి ఆయన వేసిన పునాది నేటి నాయకులకు ఆదర్శవంతమని అలాంటి నాయకుడి విగ్రహ ప్రతిష్ట మదనపల్లిలో ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టమన్నారు. కాన మండలంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు పి వెంకటరమణ, బిజెపి సీనియర్ నాయకుడు గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి, మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, యుగంధర్, రాఘవరెడ్డి, వెంకటరమణారెడ్డి, కొటాల మల్లికార్జున, హరినాథ్ రెడ్డి, మోహన్ మండలంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :