నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : తంబళ్లపల్లె మండలం లో అధికారులు స్వామిత్వ సర్వే త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రం సమీపంలోని కాలనీలో తాగునీటి పైపులైన్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి త్వరగా పూర్తిచేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా పారిశుధ్యం పై దృష్టి సారించి జనవరి 26 తేదీకి ఎక్కడ చెత్త కనపడకుండా ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం నెరవేర్చడానికి సహకరించాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్ సందర్శించి పాఠశాల ఆవరణంలోని ప్రకృతి పెరటి తోట కూరగాయల సాగు పై అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హితవు పలికారు. ఆయన వెంట ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏఈఓ సురేష్, పద్మావతి, భాస్కర్, ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు పాల్గొన్నారు
Reporter
Namitha News