Thursday, 30 July 2026 03:01:35 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కోడలి దాస్టికం రోడ్డు మీద అత్త మృతదేహం - కొడుకు, మనుమరాలు రోడ్డుపైనే మృతదేహం తో నిరీక్షణ

ఆమె నిర్మించుకొన్న సొంత ఇంటిలోకే ఆమె మృతదేహన్ని రానివ్వని కోడలి వైనం - రోడ్డు మీదే మృతదేహం తో కొడుకు ఆవేదనతో నిరీక్షణ

Date : 06 November 2025 01:10 PM Views : 327

నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : శ్రీకాళహస్తి - నవంబర్ 06 : రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అనడానికి ఉదాహరణగా గురువారం శ్రీకాళహస్తి లో ఓ ఘటన పలువురి హృదయాలను కలసివేసింది. 39 సంవత్సరాల పాటు అనేక మందికి విద్యాబోధన చేసిన ఓ మహిళా ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి 77సంవత్సరాలు , వృద్ధాప్యం అనారోగ్యం తో నేడు మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని కష్టపడి ఆమె కట్టుకున్న సొంత ఇంట్లో నుండి సాగనం పాలనే కోరికను తీర్చలేని పరిస్థితి అక్కడ నెలకొంది. చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకుని ఇంటి దగ్గరకు వస్తే మృతదేహాన్ని లోపలికి రానీకుండా నిర్ధాక్షణంగా తలుపులు మూసి మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచేసింది కోడలు. అత్యంత రద్దీ గల పెళ్లి మండపం నుండి వైఎస్ఆర్ విగ్రహానికి వెళ్లే మధ్య మార్గంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా రోడ్డు మీదే మృతదేహాన్ని పెట్టి కొడుకు మనవరాలు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరీక్షణ చేస్తున్నారు. కొడుకు సురేష్ భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం తో కోడలి సూటిపోటి మాటలు భరించలేక సురేష్ , తల్లిని తీసుకొని మనవరాలను చదివించుకుంటూ పుత్తూరులో ఉంటున్నారు. అయితే రమాదేవి తర్వాత మృతి చెందింది. ఈ నేపథ్యంలో సొంత ఇంట్లో ఉంచి తన పార్దీవ దేహాన్ని అంతిమయాత్ర నిర్వహించాలని ఆమె చివరి కోరిక తీర్చడానికి కొడుకు తన సొంత ఇంటికి తీసుకుని వచ్చాడు . కానీ ఆ కోడలు ఆమె మృతదేహాన్ని లోపలికి రానీకుండా తలుపులు బిగించి లోపల కూర్చున్నది. వారికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొడుకు సురేష్, మనవరాలు రేష్మ రోడ్డు మీద రోదిస్తున్నారు. తన తల్లి సొంత ఇంటిలోకే ఆమె మృతదేహాన్ని తీసుకోలేకపోతున్నామని కొడుకు మనవరాలు పడుతున్న ఆవేద జనాలని కలచివేస్తుంది. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆమె మృతదేహాన్ని సొంత ఇంట్లో ఉంచి అ అంతిమ యాత్ర చేసే ఏర్పాటు చేయాలని . కొడుకు సురేష్ కోరుతున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :