Friday, 31 July 2026 02:03:23 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రైతులు అప్రమత్తంగా ఉండండి

రైతులు సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసుకోండి - యస్.ఐ. రమేష్ బాబు

Date : 13 November 2025 08:46 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : రామసముద్రం మండలంలోని ప్రతి రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం పోలీస్ స్టేషన్ లో విలేకురలతో మాట్లాడుతూ మండలంలో అక్కడక్కడా విద్యుత్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్ లు డ్యామేజి చేసి కాపర్ వైరు దొంగతనాలు జరిగినట్లు మాదృష్టికి వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో మందుకు బానిసలైనవారు, చిన్న చిన్న పనులు పేరుతో పొలాలు, బోరు మోటార్లు దగ్గర కనిపిస్తే ఎందుకు వచ్చారు అని అడగాలని. ట్రాన్స్ ఫార్మర్లు, బోరు వద్ద గల షెడ్డు, రూముల వద్ద అవసరం లేని వ్యక్తులను అనుమతించరాదన్నారు. ప్రతి రోజు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంపుసెట్ లను పరశీలించాలన్నారు. రాత్రి సమయాల్లో బయట వ్యక్తులు గుర్తు తెలియని వాహనాలు పొలాలు వద్ద లేదా గ్రామాలు బయట సందేహాస్పదంగా ఆగి ఉన్నా వెంటనే గ్రామల్లో పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి రైతు పొలాలు వద్ద వెలుగులు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పంపు షెట్లు వద్ద గట్టి భద్రత కలిగిన బలమైన తాళాలు వినియోగించు కోవాలన్నారు. పొలాలు వద్ద విలువైన, డ్రిప్ పరికరాలు, రైతులకు సంబందించిన పనిముట్లు,ఎరువులు ఆస్తి విలువ ఎక్కువగా ఉంటే రైతులు సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. ప్రస్తుతం దుకాణాల్లో, ఆన్ లైన్లో కూడ తక్కువ ధరల్లో మంచి నాణ్యతతో సి సి కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, కెమెరాలు మొబైల్ కనెక్ట్ అవడం వల్ల మనం ఎక్కడున్నా పర్యవేక్షణ సులభం అవుతుందన్నారు. రాత్రి పూట పోలీస్ సిబ్బంది ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసామని పొలాలు వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మార్ల వద్ద నిఘా కొనసాగుతుందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చిన మా పోలీసులు ముందుంటామన్నారు. రైతులకు సంబందించిన వస్తువులను దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో యస్.ఐ. రమేష్ బాబు, ఏ.ఎస్.ఐ హిమచలపతి, లోకేష్, గంగిరెడ్డి, భరత్ రెడ్డి కప్యూటర్ ఆపరేటర్ జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: