నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : నూతన సంవత్సరం దృష్ట్యా హార్సిలీహిల్స్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రమాదాలకు జరిగేందుకు అవకాశం లేకుండా ముందుస్తుగా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 ఉదయం నుండి జనవరి 01 రాత్రి వరకు ద్విచక్ర వాహనాలకు, ఆటో లకు కు అనుమతించమని, కార్లు మరియు ఆర్.టి.సి. బస్సులకు మాత్రమే అనుమతి వుంటుందని, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, హార్సిలీహిల్స్ లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు, అల్లరి చేస్తూ పర్యాటకులను ఇబ్బందికి గురి చేయకూడదు, కొత్త సంవత్సర సంభరాలను రాత్రి 12 గంటలకే ముగించాలని, హోటల్ యాజమాన్యం వారి వారి గదులలో మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చూసుకోవాలి తెలియచేసారు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం నుండి జనవరి 01 రాత్రి వరకు హార్సిలీహిల్స్ లో డ్రోన్ మరియు CCTV కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియచేసారు. పర్యాటకులు అందరూ పోలీస్ వారికి సహకరించి నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రశాంతంగా జరుపుకోవాలని తెలియజేసిన డియస్పి మహేంద్ర
Reporter
Namitha News