Saturday, 18 April 2026 01:58:57 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

మిట్స్ లో నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాసం

Date : 11 April 2026 08:42 PM Views : 49

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 11 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనెట్రిక్ గ్లోబల్, బెంగళూరు-సింగపూర్ సంస్థకు చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ లలిత్ కుమార్ యాగ్నిక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటి యుగంలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా మానవ జీవన విధానాన్ని, పరిశ్రమలను మరియు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుతున్న శక్తిగా నిలుస్తోందని అన్నారు. ఐబీఎంలో దాదాపు 30 సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా, ఆసియాన్, భారతదేశం, అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లలో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ, భవిష్యత్తులో విజయం సాధించాలంటే విద్యార్థులు ఏఐ, డేటా మరియు క్లౌడ్ సాంకేతికతలపై పటిష్టమైన పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే భారతదేశంలో విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా పునర్నిర్మించడం, నేర్చుకునే విధానాలు, ఉద్యోగావకాశాలు మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తూ వారి కెరీర్ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్లు తారకేశ్వర రాజు బి మరియు వి. శివరామన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :