Thursday, 30 July 2026 06:08:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కార్మికుల సమ్మెతో తంబళ్లపల్లె కంపు.. కంపు..!

Date : 02 June 2026 10:31 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 02 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని పంచాయితీ పారిశుద్ధ్య, పంప్ ఆపరేటర్లు పనులు ఆపేయడంతో తంబళ్లపల్లె ఒక్క రోజుకే కంపు కొడుతుంది. గత మూడు మాసాలుగా పంచాయతీ కార్మికులకు జీతాలతో పాటు మరమ్మత్తుల బిల్లులు చెల్లించకపోవడంతో మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ్యపు పనులతో పాటు తాగునీటి సరఫరా సైతం ఆపేయడంతో తంబళ్లపల్లె ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులకు మొరపెట్టుకున్న వారు కుంటి సాకులు చెబుతూ దాటవేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి మంగళవారం సెలవు పై వెళ్లడంతో వారి సమస్య పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. తంబళ్లపల్లె మండల కేంద్రంలో ప్రతిరోజు సుమారు ఐదు ట్రాక్టర్ల చెత్తాచెదారం తరలించాల్సి ఉండగా ఎక్కడికక్కడ చెత్త పేరుకు పోతోంది. మురికి నీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం తో ముక్కు పగిలేలా దుర్వాసన కొడుతోంది. ఉదయం నుండి నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల వద్ద అన్ని రకాల పన్నులు ముక్కు పిండి వసూలు చేశారు. అయితే ప్రజల మౌలిక సదుపాయాలు ,సమస్యల పట్ల నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవడం పై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పంచాయతీలో నిధులు ఉన్నా చెల్లించడానికి కుంటి సాకులు చెప్పడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి పారిశుద్ధ్యపు పనులు, నీటి సరఫరా చేయకపోతే తంబళ్లపల్లెలో పారిశుధ్యం లోపించి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కాదు స్వచ్ఛ చెత్త కుప్పల కేంద్రంగా నిలవడం ఖాయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :