నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - జూన్ 16 : మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడిగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, మాజీ సైనికులు మరియు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కంచర్ల శ్రీనివాసులు నాయుడు తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సైనికుల మధ్య ఐక్యతను పెంపొందించి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొని, నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగింది. కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం కు హాజరైన ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం రాయల్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీనివాసులు పదవి లేకపోయినా మాజీ సైనికులకు అండగా ఉంటూండేవారు, ఈ పదవి మరింత బాధ్యతతో నిర్వహిస్తూ సైనికుల కుటుంబసభ్యుల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియచేసిన జంగాల శివరాం రాయల్ ఈ సందర్భంగా ఆత్మీయ అభినందనలు తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ మరియు మదనపల్లి ఇంచార్జి గంగారపు రాందాస్ చౌదరి, AMC డైరెక్టర్ గడ్డం లక్ష్మీపతి,మదనపల్లి రూరల్ మండలం ఉపాధ్యక్షులు సువరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News